24-06-2025 10:31:40 AM
హైదరాబాద్: నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్(Irrigation EE Nune Sridhar) ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. ఏసీబీ కోర్టు నూనె శ్రీధర్ ను విచారించడానికి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నూనె శ్రీధర్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. ఎస్బీఐ బ్యాంకు లాకర్ లో స్థిరాస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. బదిలీ అయిన అక్కడే ఎందుకు పని చేశారనే కోణంలో ఏసీబీ ప్రశ్నిస్తోంది. నూనె శ్రీధర్ కస్టడీ ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.