calender_icon.png 16 June, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

36 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ఏర్పాటు

15-06-2025 06:21:13 PM

రైతులతో సంభాషించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో మరో 36 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల(District Agriculture Officer Vijayanirmala) తెలిపారు. వీటితో కలిపి 82 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను  ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మూడో దశలో ఏర్పాటు చేయబడ్డ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాదు నుండి ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా రైతులతో ముచ్చటిస్తారని డీఏవో తెలిపారు.  

ప్రత్యక్ష ప్రసారం నిర్వహించబడే రైతు వేదికల వివరాలు..

మహబూబాబాద్ మండలంలో మహబూబాబాద్, జంగిలికొండ, మల్యాల, కేసముద్రం మండలంలో కేసముద్రం, పెనుగొండ, ఉప్పరపల్లి, బయ్యారం మండలంలో బయ్యారం, కొత్తపేట, రామచంద్రపురం, గంగారం మండలంలో గంగారం, కోమట్ల గూడెం, మర్రిగూడెం, గార్ల మండలంలో గార్ల, ముల్కనూరు, పోచారం, గూడూరు మండలంలో భూపతి పేట, బొద్దుగొండ, గూడూరు, కొత్తగూడ మండలంలో కొత్తగూడ, పొగళ్లపల్లి, బత్తులపల్లి, నెల్లికుదురు మండలంలో నెల్లికుదురు, ఆలేరు, మునగల వీడు, ఇనుగుర్తి మండలంలో ఇనుగుర్తి, చిన్న ముప్పారం, మరిపెడ మండలంలో గిరిపురం, చిల్లంచర్ల , ధర్మారం, తొర్రూరు మండలంలో తొర్రూర్, మాటేడు, నాంచారి మాడూర్, డోర్నకల్ మండలంలో డోర్నకల్, గొల్ల చర్ల, చిలుకోడు, సిరోలు మండలంలో మన్నెగూడెం, కాంపల్లి, తాళ్ల సంకిస, కురవి మండలంలో కురవి, బలపాల, గుండ్రాతిమడుగు, దంతాలపల్లి మండలంలో దంతాలపల్లి, కుమ్మరి కుంట్ల, పెద్ద ముప్పారం, చిన్నగూడూరు మండలంలో ఉగ్గంపల్లి, జయ్యారం, పెద్ద వంగర మండలంలో పెద్దవంగర ,ఔతాపురం, చిట్యాల, నరసింహుల పేట మండలంలో నర్సింహులపేట్, పెద్దనాగారం, కౌసల్యదీవి పల్లి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రైతులతో సంభాషిస్తారని డిఏఓ తెలిపారు.