14-02-2026 08:19:08 PM
ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు చవాన్ గుణవంత్ రావు
లింగాపూర్,(విజయక్రాంతి): ఈ నెల 17న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు చవాన్ గుణవంత్ రావు పిలుపునిచ్చారు. శనివారం లింగాపూర్ మండల పరిధిలోని గోపాలపూర్, రామునాయక్ తాండ, కొత్తపల్లి, మామిడిపల్లి, ఖిమానాయక్ తాండ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి జయంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.