14-02-2026 08:23:48 PM
భూత్పూర్: సామాజిక సేవను లక్ష్యంగా చేసుకొని, సమాజంలోని అశ్రయహీనులకు ఆశగా నిలిచిన మల్లీశెట్టి వెంకటేష్ కు శనివారం భారతీయ విద్యా భవన్ తమిళనాడు రాష్ట్రం ఐ గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (డిలే్వేర్ స్టేట్, యూఎస్ఎ) "సామాజిక సేవ" (సోషల్ వర్క్) విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్టా ప్రధానం చేశారు.
ఈ గౌరవం వ్యక్తి గత విజయానికి మాత్రమే కాదు, విలువలకు, సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతకు, మానవత్వం పట్ల ఉన్న ప్రేమకు అందించిన అంతర్జాతీయ గుర్తింపు స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇది ఒక “విన్నర్ టర్నింగ్ పాయింట్” కాదు, ఇది ఒక “సర్వీస్ టర్నింగ్ ఇంటో లేగసీ” అనే ఘనత. ఇది ఒక గౌరవం కాదు ఇది ఒక సేవా ప్రయాణంపై సమాజం ఉంచిన గౌరవంగా అవార్డు అందుకున్న ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సహకారంతో చెన్నైలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల జిల్లా ప్రజలు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.