26 March, 2026 | 1:44 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

తొలిరోజే ఏడు సెంచరీలు

12-10-2024 12:00 AM

రంజీ ట్రోఫీ 2024-25

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా తొలిరోజే ఏడు సెంచరీలు నమోదవ్వడం విశేషం. తొలి రోజు మొత్తం 16 ఎలైట్ మ్యాచ్‌లు, 3 ప్లేట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. సుదీప్ (బెంగాల్), శుభమ్ ఖజురియా (130*, జమ్మూ కశ్మీర్), రవి చౌహాన్ ( సర్వీసెస్), మనన్ హింగ్రజియా (174*, గుజరాత్), శుభమ్ అరోరా (హిమాచల్ ప్రదేశ్), ప్రశాంత్ (హిమాచల్ ప్రదేశ్), సుయాశ్ (గోవా) సెంచరీలు సాధించారు.

కాగా దేశవాలీ క్రికెట్ టోర్నీల్లో బీసీసీఐ కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై మిడ్ ఇన్నింగ్స్‌ల్లో ఆటగాళ్లు గాయాలు, అనారోగ్యం, అత్యవసర సమయం మినహాయించి మిగతా కారణాలతో రిటైర్డ్‌గా వెనుదిరిగితే ఆ మ్యాచ్‌లో మరోసారి బరిలోకి దిగేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది.  బాల్ టాంపరింగ్, ఓవర్ త్రో బౌండరీల్లోనూ పలు మార్పులు చేశారు.