రసమయి సీజనల్ లీడర్.. దత్తత గ్రామాభివృద్ధి ఏమైంది...?
01-09-2026 12:02 PM
మానకొండూరు, (విజయక్రాంతి) మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసహయి బాలకిషన్ పై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉచిత హెల్త్ క్యాంపుపై రసమయి చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రసమయి సీజనల్ లీడర్ లా అవసరం ఉన్పప్పుడే నియోజకవర్గంలో కనిపిస్తారని విమర్శించారు. ఆయన దత్తత గ్రామైన ఈదులగట్టెపల్లి అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. మానుకొండూరు అభివృద్ధి, పారిశుద్ద్యం, ఇందిరమ్మ ఇళ్లపై గత పాలనను నిలదీశారు.






