calender_icon.png 1 June, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాన్యం రోడ్లపై ఆరబెట్టకూడదు: ఎస్ఐ అజయ్ కుమార్

18-04-2025 05:21:04 PM

నడిగూడెం: రైతులు దాన్యం రోడ్ల పై ఆరబెట్టకూడదని ఎస్ఐఅజయ్ కుమార్ కోరారు. శుక్రవారం మండల కేంద్రం లో రోడ్ల పై వడ్లు ఆరబోసిన రైతులతో మాట్లాడి అవగాహన కల్పించారు. అర బోసిన ధాన్యం రాసులు పోసి నల్ల రంగులో ఉండే పాలిథిన్  పట్టాలు కప్పడం వలన  రాత్రి సమయం లో వాహన దారులకు కనిపించక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పై ధాన్యం అర బో యవద్దని  కోరారు.