21 August, 2026 | 10:01 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

మే 20న దేశవ్యాప్త సమ్మె

18-04-2025 05:25 PM

ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

మంచిర్యాల,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోరారు. శుక్రవారం మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయడం కోసం ఈ నెల 27న మార్క్స్ భవన్ లో కార్మిక సంఘాల సదస్సు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని అన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ల మెప్పు కోసమే కార్మిక చట్టాలను కుదించాలని ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.