18-06-2025 05:48:20 PM
దేవరకొండ: కొండమల్లేపల్లి పట్టణంలోని చౌరస్తా సెంటర్ వద్ద నల్లగొండ రోడ్డుపై డివైడర్ లేకపోవడంతో వాహనాలు రాంగ్ రూట్లో వెళ్తూ రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నివారణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై రమేష్(SI Ramesh) బుధవారం రహదారిపై బోలాడ్స్ డార్క్ ఐలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చౌరస్తా సెంటర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు లేక వాహనాలు రాంగ్ రూట్లో వెళ్తూ రహదారిపై తరచూ వాహనాలు ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రమాదాల నివారణ కోసం రహదారికి ఇరుపక్కల ఉన్నటువంటి మట్టి దిబ్బలను జెసిబితో తొలగించి రోడ్డుపై బోలాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసిన, రాంగ్ రూట్లో నడిపిన అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వీరి వెంట మండల పంచాయతీ ఆఫీసర్ సుధీర్ కుమార్, గ్రా పంచాయతీ కార్యదర్శి డాకు నాయక్, పోలీస్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.