07-06-2025 08:19:47 PM
ప్రియాంక వర్మ భూపతి రాజు దంపతులు..
వేములవాడ (విజయక్రాంతి): శనివారం నాంది, ఉగ్రం సినిమాల డిఓపి (Direction of Photography) సిద్ధార్థ్ ఎస్ జే - ప్రియాంక వర్మ భూపతి రాజు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అర్చకులు మామిడిపెల్లి శరత్ కుమార్ నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని, స్వామివారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామం తన సొంత ప్రాంతమని వెల్లడించారు.