07-06-2025 08:24:15 PM
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి..
సిరిసిల్ల (విజయక్రాంతి): తిప్పాపూర్ లోనీ గోశాలలో అనారోగ్యంతో ఉన్న కోడెలలో శనివారం రెండు కోడెలు మృతి చెందినట్లు, మిగిలిన వాటికి వెటర్నరీ వైద్యులు అందించే చికిత్సకు స్పందిస్తున్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1300 పశువులలో ప్రస్తుతం మొత్తం 14 కోడెలకు వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు, వైద్యానికి పది కోడేలు స్పందిస్తు, అనారోగ్యం నుండి కోలుకుంటున్నట్లు, మరో రేండు కోడేలు ఆరోగ్య పరిస్థితి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్లు, కొత్తగా ఏవీ కూడా అనారోగ్యమునకు గురికాలేదని తెలిపారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆపకుండా పేర్కొన్నారు.