calender_icon.png 8 June, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా ఆలయ పూజారి మృతి..

07-06-2025 08:14:32 PM

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయ(Keslapur Nagoba Temple) ప్రధాన కటోడ(పూజారి) మెస్రం కోసు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. నాగోబా ఆలయంలో గత కొన్నేళ్లుగా నాగ దేవతకు పూజలు చేస్తు, మెస్రం వంశస్తుల ఆచార సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నారు. మెస్రం కోసు మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన స్వగ్రామం గాదిగూడ మండలంలోని బోడ్డి గూడలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియాల్లో మెస్రం వంశీయులు, ఆయా గ్రామాల ఆదివాసీలు, ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.