రూ.5వేలు తగ్గిన వెండి
హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.2,64,900
హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో బుధవారం సుమారు రూ. 2,64,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారంతో పోలిస్తే వెండి ధర కిలోకు దాదాపు రూ.5,000 వరకు తగ్గింది. అయితే భాగ్యనగరంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కన్పించలేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం స్వచ్ఛమైన పసిడి ధరలో ఎలాంటి పెరుగుదల కన్పంచలేదు. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల వీటి ధరలు దేశీయంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు దాదాపు రూ.5వేల వరకు తగ్గి రూ.2,64,900 చేరింది. మంగళవారంతో పోలిస్తే.. వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. పసిడి ధరల తగ్గుదల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో తగ్గిన ధరలు కొనుగోలుదారులకు కొంత కలిసివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.




