calender_icon.png 22 November, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల నైపుణ్యం..

22-11-2025 05:58:19 PM

- రాష్ట్ర మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక

- అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తాం

- ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత

- సిరిసిల్ల నియోజకవర్గ మహిళలకు జిల్లా కేంద్రంలో మహిళా ఉన్నతి.. 

- తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ కష్టం, నైపుణ్యంతో తయారు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మహిళలకు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మత్తుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. గౌడ్జిల్లాలోని సిరిసిల్లలో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారై రాష్ట్ర మంతా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చీరలు మన సంస్కృతి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమే కాకుండా సిరిసిల్లలో 130 మ్యాక్స్ సొసైటీలు, 6000 మంది కార్మికులకు ఉపాధి లభించదని వెల్లడించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 32 జిల్లాల నుంచి ఎస్ హెచ్ జీ ల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.ఎస్ హెచ్ జీ ల్లో ప్రస్తుతం 18- 59 ఏండ్ల వారికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పుడు 15-18 ఏండ్ల కిశోర బాలికలకు, 60 ఏండ్ల వయసు పైబడిన వారికి కూడా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని, రూ. రెండు లక్షల వరకు రుణ బీమా, రూ.పది లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 5560 మంది ఎస్ హెచ్ జీల్లో చేరారని తెలిపారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు ఇప్పుడు ఎస్ హెచ్ జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబేర బేగం, రాణి, చైర్మెన్ రాములు నాయక్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.