22-06-2025 10:12:37 PM
పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్..
హనుమకొండ (విజయక్రాంతి): సామాజిక సేవే తమ సంస్థ లక్ష్యమని పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్(Padmakshi Housing Welfare Association) అధ్యక్షుడు పాశికంటి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలోని తిరుపతి తిరుమల దేవస్థానం కల్యాణ మండపంలో పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభను ఆయనతో పాటు సంస్థ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ అనుముల రమేష్, ప్రతినిధులు పాశికంటి జయలక్ష్మి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘటితం కావాలని కోరారు. పరస్పర సహకారంతో అసోసియేషన్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మాక్షి హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాశికంటి సత్యప్రకాష్, కోశాధికారి పాశికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుసుమ అశోక్, ప్రతినిదులు సుకన్య, మౌనిక, సౌమ్య, విజయ, శిరీష, మాటేటి కవిత, రమ్య, గున్నాల వినోద్ రఘు, ఆమంచ సురేష్, వెల్దండి సత్యం తదితరులు పాల్గొన్నారు.