22-06-2025 10:19:42 PM
వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు..
సీఐ రఘువీర్ రెడ్డి...
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, దేశ భవిష్యత్తు యువతదే కాబట్టి వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సీఐ రఘువీర్ రెడ్డి(CI Raghuveer Reddy) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ నరసింహ(District SP Narasimha) ఆదేశానుసారం ఆదివారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో మాధక ద్రవ్యాల నిర్మూలనపై యువతకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనే మహమ్మారి తీవ్ర సమస్యగా మారిందని దాని బారిన పడకుండా యువత సన్మార్గంలో నడిచి డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడాలని హితవు పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించి చెడు అలవాట్లకు లోను కాకుండా సక్రమ మార్గంలో నడిచే విధంగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బాలకృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.