17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆరబోసిన పంటను పరిశీలించిన సోసైటీ చైర్మన్

11-04-2025 07:05 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ శివారులో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అకాల వర్షం రావడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. తడిచిన పంటను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని 161వ జాతీయ రహదారిపైన రైతులు ఆరబెట్టిన పంటను మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పరిశీలించారు. అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట ఆరబెట్టడానికి ఎక్కడ స్థలం లేక జాతీయ రహదారిపైకి తీసుకురావడం రైతులు ఆరబెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. అకాల వర్షంతో మొక్కజొన్న రైతన్నలకు ఇబ్బందులు పడవలసి వస్తుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.