నార్కెట్పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్వేర్ మృతి
27-04-2026 10:19 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి-అద్దంకి రోడ్డులో(Narketpally-Addanki Road) సోమవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు నిలిచి ఉన్న లారీని ఢీకొనడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సందీప్ మృతి చెందాడు. సందీప్ నర్సంపేట నుండి హైదరాబాద్ వెళ్తుండగా, పనగల్లు ఫ్లైఓవర్పై(Panagal Flyover) ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






