11-05-2025 12:00:00 AM
టాన్సిల్స్ రావడానికి ప్రధాన కార ణం వేడి చేసే పదార్థాలు తినడం (ఫ్రిజ్జ్ లో నీరు తాగడం, కూల్ డ్రింక్స్, మసాలా లు, కారం, పచ్చళ్లు). వాతావరణానికి తగ్గ ట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మా ర్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బం ది పెట్టవని చెబుతున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే రాళ్ల ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే 90 శాతం నొ ప్పి మాయం అవుతుందని ఆయుర్వేద ని పుణులు చెబుతున్నారు.
అలాగే తాగే నీరు కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. అదే వృద్ధులకు గొంతులో నొప్పి, కఫం తగ్గాలంటే మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరిస్తే మంచి ఫలితం ఉం టుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ నొప్పి తగ్గాకుంటే మాత్రం డాక్టరును కచ్చితంగా సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.