11-05-2025 12:00:00 AM
గర్భం ధరించినప్పుడు శారీరకంగా వివిధ మార్పులు వస్తుంటాయి. పిగ్మెంటేషన్ కూడా ఇలాంటి వాటిలో ఒకటి. బుగ్గలు, నుదురు పైన ఏర్పడే నల్లటి మచ్చల కారణంగా ఒక్కోసారి ముఖంలో కళ లోపిస్తుంది. అయితే ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చంటున్నారు నిపుణులు.
* గుప్పెడు పుదీనా ఆకులకు నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్లా తయారుచేసు కోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్లు చేసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. పిగ్మెంటేషన్ బారి నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే రోజుకు రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* ఒక చెంచా చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకుని ఈ మూడింటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్నచోట అప్లు చేసుకుని పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
* తేనె ఒక చెంచా, కలబంద గుజ్జు ఒక చెంచా తీసుకుని అందులో రెండు చెంచాల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది.
* నారింజ పండు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో పచ్చిపాలను చేర్చి పేస్ట్లా తయారుచేసుకొని ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట అప్లు చేసుకో వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడటమే కాదు.. చర్మం తాజాగా.. కాంతివంతంగా మారుతుంది.
* సన్స్క్రీన్ లోషన్లు రాసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ 30 సన్స్క్రీన్ రాసుకోవడం, ముఖాన్ని స్కార్ఫ్తో కవర్ చేసుకోవడం వంటి చిట్కాలను పాటించాలి.