calender_icon.png 21 June, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించండి

21-06-2025 08:25:28 AM

ఎన్పీడీసీఎల్ సిఎండి ని కోరిన టిఆర్వికేఎస్ నాయకులు 

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్స్, బిల్ కలెక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని టిఆర్వికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె.వి జాన్సన్,ప్రధాన కార్యదర్శి చారు గుండ్ల రమేష్ ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి కోరారు.  హనుమకొండలోని విద్యుత్ భవన్ లో ఆయనను కలిసి కార్మికుల సమస్యలను చర్చించారు. ప్రధానంగా ఆర్టిజన్స్ గ్రేట్ చేంజ్ ఈ నెలలో చేపడతామని, ఉద్యోగులకు ఆర్టిజెన్స్ కు పెన్షనర్లకు రావలసిన డిఎ డిఆర్ ఈ నెలలో విడుదల చేస్తామని, కంపెనీ పరిధిలో జనాల ట్రాన్స్ఫర్స్ ను జూలైలో నిర్వహిస్తామని, జేఎల్ఎం నియామకం కొరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన కార్మిక సంఘం నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. బిల్ కలెక్టర్ సెక్రటరీ గార్ల వేతనాలు పెంచుతామన్నారు. సీఎండే ని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడూరి ప్రకాష్, రాష్ట్ర సీనియర్ అదనపు ప్రధాన కార్యదర్శి పోదరి గోపాలరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర పాల్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ అజీజ్ బండారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.