4 May, 2026 | 3:09 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

చక్రయ్యగౌడ్ హత్య కేసులో అల్లుళ్లు, కూతుర్లే నిందితులు

25-03-2025 12:48 AM

వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట, మార్చి24 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే నిందితులని ఎస్పీ నరసింహ తెలిపారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.

చక్రయ్య గౌడ్ హత్యలో అతని అల్లుళ్లు, కూతుర్లే ప్రధాన నిందుతులని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అల్లుడు వెంకన్న, అతడి భార్యతో పాటు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు కార్లు, ఒక కర్ర, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటున్నారు.