08-06-2025 12:43:57 AM
కామారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): తా ము బతికున్నంత కాలం తమ పేరిట ఉన్న భూమి పంపకాలు చేపట్టలేమని చెప్పిన వృద్ధ తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసి, ఇంటికి తాళం వేశాడో కొడుకు. ఆ వృద్ధ దంపతులు కామారెడ్డి ఏఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండ లం కాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి బాగవ్వ దంపతులు.
వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. రామయ్య పేరు న ఉన్న 5.04 ఎకరాల భూమిని నలుగురు కొడుకులకు ఎకరం చొప్పున పట్టా చేసిచ్చా డు. రామయ్య పేరున 1.04 ఎకరాలు భూ మి ఉన్నది. రామయ్య మూడో కుమారుడు చంద్రం ప్రేమ వివాహం చేసుకొని నిజామాబాద్ పట్టణంలో ఉంటున్నాడు. అయితే రా మయ్య పేరును ఉ న్న భూమిని కూడా వాటా కింద పంచిస్తే, అ మ్ముకొని అప్పు లు కట్టుకుంటానని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు.
తాము బ తికున్నంత కాలం, తన పేరిట ఉన్న భూమిని ఎవరికి పంచి ఇ వ్వబోమని, తమను ఎవరు బాగా చూసుకుంటే వారికే భూమి ఇస్తామని తల్లిదం డ్రులు తేల్చి చెప్పారు. దీంతో గ్రామంలో తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి నుంచి వారి ని గెంటేసిన చంద్రం, ఇంటికి తాళం పెట్టా డు. అంతేకాకుండా చంద్రం తీసుకున్న అ ప్పుడ కట్టడం లేదని అతడికి అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా తమ భూమిలో సాగుకు ప్రయత్నిస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపించారు.
ఈ మేరకు శనివారం కామారెడ్డి ఏఎ స్పీ బొక్క చైతన్యరెడ్డిని కలసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వేధింపులకు గురి చేస్తు న్న కొడుకు, కోడలుతో పాటు, భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యక్తిపైనా ఏఎ స్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.