08-06-2025 12:42:05 AM
టెన్త్లో 57.60 శాతం, ఇంటర్లో 59.77 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితా లను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసై టీ (టాస్) శనివారం ఉదయం విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఓపె న్ టెన్త్లో 57.60 శాతం మంది, ఇంటర్లో 59.77 శాతం మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ లో 16,948 మంది పురుషులు, 11, 599 మంది మహిళలు పరీక్షలు రా యగా, 9,023 మంది పురుషులు, 7,420 మంది మహిళలు పాసయ్యారు.
ఓపెన్ ఇంటర్లో 25,187 మంది పురుషులు, 15,864 మంది మహిళలు పరీక్షలు రాయగా, పురుషులు 14,479 మంది, మహిళలు 10,059 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండింటిలోనూ మహిళలే ఫలితాల్లో పైచేయి సాధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 18 వరకు అవకాశం కల్పించాచినట్లు టాస్ డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. రీకౌంటింగ్కు ఒక్కో పేపర్కు (ఇంటర్) రూ.400కాగా, ఎస్సెస్సీకు రూ.350, రీవెరిఫికేషన్కు ఇంటర్, టెన్త్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.