16-11-2025 03:13:45 PM
కోల్కతా: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయన్ని చవిచూసింది. తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిగిన భారత్ 93 పరుగులకే ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్ లో వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా (18), ధ్రువ్ జురెల్ (13) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ లో సైమన్ హార్మర్ (4), మర్కో యాన్సన్ (2), కేశవ్ మహరాజ్ (2) వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులు, రెండో ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా 153, భారత్ 93 పరుగులు చేశాయి. తొలి ఇన్నింగ్ లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పితో బాధపడుతు గార్డెన్ నుంచి వెళ్లిన శుభ్ మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ కు బ్యాకింగ్ రాలేదు. భారత్ లో 15 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ గెలిచింది.