calender_icon.png 9 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి 6,431 ప్రత్యేక బస్సులు

08-01-2026 01:04:35 AM

ఆర్టీసీ ఛార్జీలు 50 శాతం అదనం

  1. రద్దీకి అనుగుణంగా సర్వీసులు
  2. స్పెషల్ మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే..
  3. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు
  4. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారి ని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. పండు గకు 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని, ఈ మేరకు ఛార్జీలను 50 శాతం అదనంగా పెం చాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయా ణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది.

అలాగే, ఈనెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయా ణ రద్దీకి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎం జీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోం ది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.

ఈ సంవత్సరం సం క్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 50 శాతం వరకు టికెట్ ధరలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవ రించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 12, 13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి.

స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మిపథకంలో భాగంగా సంక్రాంతికి నడి పే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉం టుంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్‌సై ట్ లో బుక్  చేసుకోవాలని, సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్ర దించాలని యాజమాన్యం సూచించింది.

జీవో నంబర్ 16 ప్రకారం అదనపు వడ్డన

ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉం డేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది.

ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబ ర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 50 శాతం వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తుంది. టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.