20-06-2025 12:00:00 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల , జూన్ 19 : శంకర్పల్లి మున్సిపాలిటీలో పారి శుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. గురువారం శంకర్పల్లి మున్సిపాలిటీలో రూ.14 లక్షల నిధులతో అం డర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలెయా దయ్య హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శంకర్పల్లి మున్సిపల్ అభివృద్ధికి ఒక కార్యాచరణ రూపొందించి దశలవారీగా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. శంకర్పల్లిలో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.