07-06-2025 10:01:07 AM
ఏరియా యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు వినతి పత్రాన్ని అందించిన టి బి జి కె యస్ వైస్ నాయకులు
మణుగూరు (విజయక్రాంతి): క్వార్టర్ మరమ్మతుల కోసం కార్యాలయం కు వచ్చే దరఖాస్తుల పరిశీలించి, ఇన్ వార్డ్ లో క్రమ సంఖ్య నమోదు ఆధారంగా మరమ్మతుల పనుల చేపట్టాలని కోరుతూ ఏరియా యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్, సూచన మేరకు కార్మిక సంక్షేమ అధికారి రమేష్ సారథ్యంలో ఏరియా నందు క్వార్టర్ కౌన్సిలింగ్ కేటాయింపులు అత్యంత పారదర్శంగాకంగా నిర్వహిస్తున్నారని కార్మిక, వారి కుటుంబ సభ్యుల్లో మంచి అభిప్రాయాలు ఉందన్నారు.
క్వార్టర్ మరమ్మతుల పనుల అంశం లో వచ్చే సరికి కార్మిక వారి కుటుంబ సభ్యుల నుంచి అపఖ్యాత పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. క్వార్టర్ మరమ్మత్తుల పనుల్లో కుల, మత, వర్ణ, వర్గాలు చోటుచేసుకుంటున్నాయని కార్మిక వారి కుటుంబ సభ్యుల నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయన్నారు. న్యాయబద్దంగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత లేకపోవడం వల్ల కార్మిక వారి కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వార్టర్ మరమ్మత్తుల పనులు నిర్వహణ కోసం ప్రత్యేక నియమ నిబంధనలు రూపొందించాలని, పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా క్వార్టర్ రిపేర్ పనులు చేపట్టే విదంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు