07-06-2025 09:58:44 AM
మణుగూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని మల్లారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్య దేవి కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ సంవత్సరం బడిలో చేరే విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల దాతలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, బడి బాట లక్ష్యాలను , ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడులలోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరహరి , పంచాయతీ కార్యదర్శి విజయ కుమార్, గొందిగూడెం scrp గాంధీ , తల్లిదండ్రులు, గ్రామస్తులు మడకం విజయలక్ష్మీ,మడకం శ్రీను,సరోజినీ తదితరులు పాల్గొన్నారు.