calender_icon.png 7 June, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుమల్లారం పాఠశాలలో బడిబాట గ్రామ సభ

07-06-2025 09:58:44 AM

మణుగూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని మల్లారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్య దేవి కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ సంవత్సరం బడిలో చేరే  విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల దాతలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, బడి బాట  లక్ష్యాలను , ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడులలోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని  ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరహరి , పంచాయతీ కార్యదర్శి విజయ కుమార్, గొందిగూడెం scrp గాంధీ , తల్లిదండ్రులు, గ్రామస్తులు మడకం విజయలక్ష్మీ,మడకం శ్రీను,సరోజినీ తదితరులు పాల్గొన్నారు.