మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు
కొలంబో: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై శ్రీలంకకు చెందిన అత్యున్నత స్థాయి బౌద్ధ సన్యాసులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. బౌద్ధ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పదవులలో ఒకరైన పల్లెగమ హేమరతన థేరో, శ్రీలంకలోని ఎనిమిది పవిత్ర క్షేత్రాలకు ప్రధాన పీఠాధిపతిగా ఉన్నారు.
ఈ కేసులో అనుమానితుడిగా పేరు ఉన్నప్పటికీ, పోలీసులు అతన్ని అరెస్టు చేయనందుకు గతంలో విమర్శించిన దేశ బాలల సంరక్షణ సంస్థ చేసిన విజ్ఞప్తి మేరకు హేమరతన థేరో అరెస్టు చేయబడ్డాడు. పల్లెగమ హేమరతన ఆ ఆరోపణలపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని, ఆయనను మే 12న కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అకృత్యానికి బాధితురాలి బాలిక తల్లి సహకరించినట్లు ఆరోపణలు ఉండటంతో, ఆమెపైనా అనురాధపురలోని మేజిస్టేట్ కోర్టు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
శనివారం అరెస్టు అయినప్పుడు, పల్లెగమ హేమరత్న కొలంబోలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను కొలంబో జైలు ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పల్లెగమ హేమరత్న దేశం విడిచి పారిపోకుండా చూసుకోవాలని ఆయన వలస అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయంగా శక్తివంతులుగా, సమాజంలో గౌరవనీయులుగా ఉండే శ్రీలంకలో, బౌద్ధ సన్యాసులు, మరీ ముఖ్యంగా అంతటి ఉన్నత స్థాయి వ్యక్తి అరెస్టు కావడం అసాధారణం.






