13-06-2025 01:58:28 AM
విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించండి
ప్రతి స్కూల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించాలి
మే నెలలో టీచర్లతో విస్తృత ప్రచారం.. కానీ వారికి జీతాలు నిల్..
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 (విజయ క్రాంతి) మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తం గా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలలో ఫీజు ల దోపిడిని అరికట్టి, తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని, సామాజిక సేవ కులు కర్నేబాబురావు గురువారం మండల విద్యాశాఖ అధికారినికి స్వర్ణ జ్యోతి కి మెమోరెడం అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ..
సబ్ డివిజన్ లో కాయ కష్టం చే సే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రైవేటు పాఠశాల ను ఆశ్రయిస్తే అక్కడ చదువుకునే రోజులు పోయి చదువు“కొనే” రోజులు వచ్చాయన్నారు. బడి తలుపులు తీస్తున్న వేళ తల్లిదం డ్రుల్లో ఫీజుల టెన్షన్ మొదలైం,ప్రైవేటు స్కూళ్ళు, కార్పొరేట్ విద్యాసంస్థలలో పుస్తకా లు, ఫీజులు చూస్తుంటే తల్లిదండ్రుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.
ఓ వైపు ప్రవేట్ విద్యాసంస్థలు ఫీజుల మోతతో వ్యవహరించడంతో పాటు,అడ్డదిడ్డంగా ఫీజులు పెంచి. ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నా వి ద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. ఈ విషయం ఫై పలు మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపానాపోలేదన్నారు. తోక పేర్లతో నిర్వహిస్తున్న పాఠశాలలలో ఫీజుల దోపిడీ యదేచ్ఛగా సాగుతున్నడంటం తో పాటు ఆ పాఠశాలలోనే పుస్తకాలు, యూని ఫాం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఘ టనలు అనేకం వెలుగు చూస్తున్నాయన్నారు.
దీంతో తల్లిదండ్రులపై చదువుల భారం అధికమైందన్నారు. ఎల్కేజీ నుంచే ఫీజుల బాదుడు భారీగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ఏం చేయాలోతెలియక సతమతమవుతు, బడి తలుపులు తెరిచే సమయానికి పిల్లలు చదువు కోసం వేలల్లో, లక్షల్లో సొ మ్ములు చూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక పేరున్న ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే ఆరు నుంచి పదో తరగతి వర కు తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.50 వేల నుంచి 80 వేల వరకు ఫీజుల రూ పంలో అవుతుందన్నారు
ట్రాన్స్పోర్టు ఫీజు అదనం..
ఫీజులకు తోడు తమ పాఠశాలలోనే స్కూల్ బుక్స్ యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారని, పిల్లవాడికి అంత ఖరీదైన బుక్స్ ఏముంటాయని ప్రశ్నించారు. ప్రతి సంవత్స రం ఇలా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుకొంటూ పోతే ఎలా చదివించు కోవాలని ఓ మధ్య తరగతి కుటుంబం ఆవేదన చెందుతోందన్నారు. రోజురోజుకూ పె రుగుతున్న చదువుల భారం తగ్గించేందుకు గత ప్రభు త్వం కొంత ప్రయత్నం చేసి పేరెం ట్స్ కమిటీ సభ్యులతో చర్చించి ఆరోగ్యకరమై న, హర్షనీయమైన ఫీజుల విధానం ఉండే లా చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే సఫలం కాలేదన్నారు.
ప్రైవేటు స్కూల్స్ యజమాన్యాలు ప్రభుత్వ చర్యలు అమలు చేయనీయలేదని, పేరెంట్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ మాయలో పడిపోతున్నారని,ఇంగ్లీషు మీడియం పేరు తో సరైన విద్యార్హతలు లేని ట్యూటర్లతో బోధన చేస్తున్నప్పటికీ అక్కడ ఏదో చేప్పేస్తారు అనే అపోహతో అధిక ఫీజులు చెల్లిం చి మరీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్లో చేర్పించి అప్పులు పాలవుతున్నారన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పం దించి అధిక పీజులు వసూలు చేసే ప్రైవే ట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ఎ ప్పటికప్పుడు చర్చలు జరిపి అందరీకీ ఆమో ద యోగ్యమైన ఫీజులునిర్ణయించాలనిసూచించారు.
అలాగే మే నెలలో కూడా విద్యా ర్థుల నుండి ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, అధ్యాపకులను ప్రచారం కోసం వాడుకునే వారు కనీసం ఉపాధ్యాయులకు మే నెల జీతా లు ఎందు కు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు అధిక పీజులను వసూలు చేసే ప్రైవేట్ విద్యాసంస్థలను కట్టడి చేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయా లని కోరా రు. లేనిచో జిల్లా విద్యాశాఖ అధికారుల కు, విద్యాశాఖ మంత్రికి సమగ్ర వివరాలతో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కొరతమని బాబురావు తెలిపారు.