29-05-2025 12:00:00 AM
మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘షష్టిపూర్తి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాక ఇందులో హీరోగానూ నటించారు రూపేశ్. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా, ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటించింది.
దీనికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రూపేశ్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. “షష్టిపూర్తి’లాంటి కథలు ప్రస్తుతం రావడంలేదు. హింసతో కూడిన సినిమాలే వస్తున్నాయి. ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉన్నా నటించడంలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాను.
ఇది పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ, ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఇటీవల ఇలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్స్టోరీ రాలేదు. పవన్ ప్రభ కేవలం రాజేంద్రప్రసాద్ కోసమే రాసుకున్న కథ ఇది. ఇళయరాజా సంగీతంతో ఈ సినిమా స్థాయి పెరిగింది. ఈ సినిమా కోసం చాలా వర్క్షాప్స్ చేశాం. నాకైతే ఎమోషనల్ సీన్స్ చేయడమే సులభం అనిపిస్తుంది” అని చెప్పారు.