31-05-2025 08:29:19 PM
వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించిన ఎస్సై
పినపాక,(విజయక్రాంతి): వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలలో నకిలీ విత్తనాలు లభిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ హెచ్చరించారు. నకిలీ విత్తనాల అమ్మతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో డీఎస్పీ, సీఐ ఆదేశాలతో అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుతో కలిసి శనివారం మండలంలో తనిఖీలు చేపట్టారు. ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలను పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. విత్తనాల స్టాక్, రిజిస్టర్ లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని విత్తనాలు అధిక దిగుబడులు వస్తాయని పురుగుమందుల వాడకం తక్కువగా ఉంటుందని గ్రామాలలో ఏజెంట్లుగా పెట్టుకొని ఆ విత్తనాలను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా ఉంచుతామని, తనిఖీలు చేసి పట్టుపడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మవద్దని ప్రభుత్వం నిషేధించిన పురుగుమందులను విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణాలలో ఉన్న నిల్వలు రిజిస్టర్లలో నమోదు వివరాలను తనిఖీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.