calender_icon.png 2 June, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ వికసించిన మే పుష్పం

31-05-2025 08:26:31 PM

ఏడాదిలో ఒక్కసారే వికసించే పువ్వు..

15 రోజులు ఆలస్యం..

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం నిర్మల్ పట్టణ కేంద్రంలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారే వికసించే ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. మే మాసం రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. నిర్మల్ పట్టణ కేంద్రంలోని భాగ్యనగర్ లో డాక్టర్ ఉమేష్ గుప్తా- సుజాత దంపతుల నివాసంలోని పెరటిలో ఈ పుష్పం తాజాగా పూసింది. ఈ అరుదైన పువ్వులు చూడటానికి ప్రజలు వారి ఇంటికి వస్తున్నారు. వాటిని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తన్నారు. ప్రతి సంవత్సరం మే 15న పూసే పువ్వు ఈ సంవత్సరము మే ముప్పై ఒకటిన పూసిందని తెలిపారు.