25-06-2025 12:42:48 AM
రాజన్న సిరిసిల్ల: జూన్ 24(విజయక్రాంతి) జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆ దేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా సము దాయంలోఎస్పీ మహేష్ బి గీతే , సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ స మావేశాన్ని నిర్వహించారు.
జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో నమోదవుతున్న ఎన్. డి. పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సు దీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణరూపొందించు.