24 August, 2026 | 10:16 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

అనుమతి లేని గ్లోబల్ మైండ్ పాఠశాలను సీజ్ చేయాలి

24-08-2026 04:37 PM

పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా 

గ్లోబల్ మైండ్ పేరును తొలగించాలని ఆదేశాలు

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 24 ( విజయక్రాంతి ): భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా గ్లోబల్ మైండ్ పేరుమీద పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వి  విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాతుకు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను, విద్యాశాఖ అధికారులను మోసం చేస్తూ గుర్తింపు పొందిన పాఠశాల పేరు కాకుండా హైదరాబాదుకు చెందిన గ్లోబల్ మైండ్ పాఠశాల పేరు పెట్టి పాఠశాల నడిపించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటి నుండి జీతాలు ఇవ్వకపోగా ఇటీవల టీచర్లు, అయమ్మలు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారని అన్నారు. నిరసన కార్యక్రమాలతో తరచూ పాఠశాల నడవక విద్యార్థులు నష్టపోతున్నారని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి దేవా నాయక్ స్పందించి అనుమతి ఉన్న పాఠశాల పేరును కాకుండా ఇతర పాఠశాల పేరు పెట్టుకొని నడిపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.