calender_icon.png 27 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య

27-06-2025 02:04:09 PM

వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు(Sri Venkateswara Zilla Parishad High School) ఎంతో ఘన చరిత్ర కలిగి ఉంది. ఈ పాఠశాలను 1962 లో నాటి సర్పంచ్ కుంభం రమణారెడ్డి ఏర్పాటు చేయించడం జరిగింది. నాడు ఎన్నో గ్రామాల నుండి ఈ పాఠశాలకు చదువుకునేందుకు విద్యార్థులు వచ్చేవారు. ఈ పాఠశాలలో జరుగుతున్న ఎంతోమంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలు సాధించడం జరిగింది. అటువంటి పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

అయితే ఇదే పాఠశాలలో చదివిన పలువురు ఉపాధ్యాయులు తాజాగా పాఠశాలకు బదిలీపై రావడంతో బడిని కాపాడుకునే బాధ్యతకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రాధాన్యత తెలియజేస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని విద్యార్థులకు కావలసిన పుస్తకాలను మధ్యాహ్న భోజన పథకాన్ని క్రీడలను యూని ఫామ్ ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుందని ప్రోత్సహించడం జరిగింది. దీంతో ఈ సంవత్సరానికి గాను 60కి పైగా విద్యార్థులు నూతనంగా పాఠశాలలో చేరడం జరిగింది. దీంతో తమ కృషి కొంత మేరకు ఫలించిందని రానున్న  రోజుల్లో మరింత మంది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామని  ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.