calender_icon.png 11 June, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టైపెండ్ కోసం విద్యార్థుల ధర్నా

10-06-2025 12:45:30 AM

చేవెళ్ల, జూన్ 09 : పట్నం మహేందర్ రెడ్డి (పిఎంఆర్) మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు సోమవారం ధర్నా చేపట్టారు. గత 11 నెలలుగా ఇంటర్న్షిప్ స్టైపెండ్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ‘వి వాంట్ స్టైపెండ్‘ అంటూ ప్లకార్డులతో కాలేజీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం, ఇంటర్న్షిప్ చేసే విద్యా ర్థులకు నెలకు రూ.25,000 స్టైపెండ్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, 11 నెలలుగా ఈ చెల్లింపులు జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలేజీ యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారుడిమాండ్‌చేశారు.