10-06-2025 12:45:30 AM
చేవెళ్ల, జూన్ 09 : పట్నం మహేందర్ రెడ్డి (పిఎంఆర్) మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు సోమవారం ధర్నా చేపట్టారు. గత 11 నెలలుగా ఇంటర్న్షిప్ స్టైపెండ్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ‘వి వాంట్ స్టైపెండ్‘ అంటూ ప్లకార్డులతో కాలేజీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం, ఇంటర్న్షిప్ చేసే విద్యా ర్థులకు నెలకు రూ.25,000 స్టైపెండ్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, 11 నెలలుగా ఈ చెల్లింపులు జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలేజీ యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారుడిమాండ్చేశారు.