30 June, 2026 | 11:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఈజిప్ట్‌లో జలాంతర్గామి మునక.. ఆరుగురు మృతి!

28-03-2025 12:08 AM

కైరో: ఈజిప్ట్ తీర నగరమైన హుర్‌ఘడలో ఎర్ర సముద్రంలో పర్యాటకుల నౌక మునిగిపోయింది. ప్రమాద సమయంలో సబ్‌మెరైన్‌లో దాదాపు 40 మంది ఉండగా వీరిలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. హుర్‌ఘడ నగరం పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి బీచ్‌లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. దీంతో పర్యాటక జలాంతర్గాములు ఇక్కడ సేవలందింస్తుంటాయి. ఇందులో సింద్‌బాద్ అనే టూరిస్ట్ సబ్‌మెరైన్ కూడా ఒకటి. సముద్రంలో 25 మీటర్ల లోతు వరకు పర్యాటకులను అనుమతిస్తుంటారు. హుర్‌ఘడలో కొంతకాలంగా పర్యాటక పడవల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత నవంబర్‌లోనూ ఓ టూరిస్టు బోటు మునిగిపోయిన ఘటనలో బ్రిటిష్ జంట సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు.