11 May, 2026 | 1:49 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

29-08-2024 12:51 PM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రమేయం ఉన్న 2015 ఓటుకు నగదు కుంభకోణం కేసులో విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు విచారించే ఏసీబీ(హోంశాఖ) సీఎం పరిధిలో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కేసు ట్రయల్ పై పూర్తి అనుమానాలున్నాయని పిటిషనర్ లాయర్ తెలిపారు. అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్లేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ లో వైఖరి మారిందని జగదీశ్ రెడ్డి న్యాయవాది వెల్లడించారు. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తాం.. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.