calender_icon.png 31 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుకు ఊరట

29-05-2025 02:10:12 PM

న్యూఢిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Intelligence Bureau) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రభాకర్ రావు పిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. భారత్ కు వచ్చేందుకు సుప్రీంకోర్టు పాస్ పోర్టు మంజూరు చేసింది. ఐపీఎస్ ప్రభాకర్ రావు మూడు రోజుల్లో భారత్ కు రావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు(Prabhakar Rao) సూచించింది.

మూడు రోజుల్లో భారత్ కు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని అండర్ టేకింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ ఆగస్ట్‌ 5కి  చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడి, అతని పాస్‌పోర్ట్ రద్దు చేయబడిందని ఒక పోలీసు అధికారి గతంలో తెలిపారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.