8 April, 2026 | 4:22 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

19-02-2026 02:03 PM

న్యూఢిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఆర్థిక లోటులో ఉన్నా ఉచిత పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచితాలు అమలు చేస్తున్నాయని వెల్లడించింది. ఉ

చిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కు బదులు ఉపాధికి కృషి చేయాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని డీఎంకే(DMK) హామీ ఇచ్చింది. డీఎంకే పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కేంద్రప్రభుత్వానికి(Central Government) నోటీసులు ఇచ్చింది. ఉచిత హామీలు ఇస్తున్న పార్టీల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు భూ యజమానులకు కూడా అందుతున్నాయన్న సుప్రీంకోర్టు అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది.