calender_icon.png 17 September, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్ నుంచి నీటి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌పై సర్వే చేయండి

17-09-2025 01:54:11 AM

శివన్నగూడెం రిజర్వాయర్ పనుల సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  

మునుగోడు,సెప్టెంబర్ 16 (విజయకాంతి): శివన్న గూడెం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నప్పటికీ  ఆ రిజర్వాయర్ లోకి  ఎక్కడి నుండి నీటిని తరలించాలని తల తోక తెలియకుండానే గత ప్రభుత్వం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్న గూడ రిజర్వాయర్ పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు,

రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో  హైదరాబాదులోని తన నివాసంలో  సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను చొరవ తీసుకొని   సంబంధిత మంత్రి, నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి  మహబూబ్నగర్ జిల్లాలోని ఎదుల్ల రిజర్వాయర్ నుండి శివన్నగూడ రిజర్వాయర్ కు   నీటిని తరలించేలా 1800 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకొచ్చా మన్నారు.

రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ  రిజర్వాయర్ కింద డిస్టిబ్యూషన్ నెట్వర్కు  పనులు మొదలు కాలేద ని వెంటనే రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలన్నారు. ఎదుల్ల రిజర్వాయర్ నుండి  శివన్నగూడెం రిజర్వాయర్కు నీటిని తరలించే పాయింట్  వద్ద  ఎఫ్ ఎస్  ఎల్ పూర్తి సరఫరా స్థాయి 437.375 గా నిర్ధారించగా, అక్కడి ఇంజనీర్లు  దానిని 440 ఎఫ్ ఎస్ ఎల్‌గా ఉండాలని పట్టుబడుతున్నారని  ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎట్టి పరిస్థితుల్లో 440  ఎఫ్ ఎస్ ఎల్  కి ఒప్పుకునేది లేదని, నిర్ణయించిన 437 ఎఫ్‌ఎస్‌ఎల్ నుండే నీటిని తరలించేలా చర్యలు తీసుకువాలని అధికారులను ఆదేశించారు.   

ఇప్పటికే శివన్న గూడెం రిజర్వాయర్ నుండి  తాగునీరు అందించడానికి  సుమారు 1200 కోట్ల రూపాయలతో  ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.ఆ పనుల పురోగతిపై  చర్చించారు. మూసి నుండి  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టు పనుల కోసం సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలి.  వర్షాకాలంలో  మూసీ నదిలోకి వృధాగా వెళుతున్న జలాలను ఒడిసిపట్టి  వాటిని చౌటుప్పల్ మండల సాగునీటి అవసరాల కోసం  వాడుకోవడానికి  చిన్న మూ సి నుండి  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసం సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలన్నారు. 

ఈ సమీక్ష సమావేశంలో మాల్ ఎస్ ఈ. శ్రీనివాసరెడ్డి, మర్రిగూడెం ఈ ఈ  రాములు, చండూరు డిఈ కాశీం  లతో పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు  శ్యాం ప్రసాద్ రెడ్డి, సత్తిరెడ్డి ఇంద్రసేనారెడ్డి  ఉన్నారు.