calender_icon.png 29 June, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

29-06-2025 12:00:00 AM

లంకెబిందె గుర్తుందా?

పూర్వం డబ్బు, నగలు దొంగలపాలు కాకుండా లంకెబిందెల్లో దాచి, భద్రంగా భూమిలో పాతిపెట్టేవారు. వారికివి వ్యక్తిగత బ్యాంకుల్లాంటివన్న మాట. దబలా అని పిలిచే ఈ పాత్ర పంచలోహాలతో చేసింది. దీనిపై అరబిక్, ఉర్దూ లిపిలో రాసి ఉండటంతో 500 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని జునాగఢ్ రాజుల కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు.

శైలేష్ ప్రజాపతి అనే వ్యక్తి దీన్ని సేకరించి గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలో ఉంచాడు. ఇలాంటి అరుదైన వస్తువులను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇదొక అరుదైన వస్తువని. 

వెదురు వాటర్ బాటిల్

ప్లాస్టిక్, స్టీల్, రాగి, మట్టి పాత్రలతో చేసిన వాటర్ బాటిల్స్‌ను చూసే ఉంటాం. కానీ పూర్వం మన పెద్దలు.. ప్రకృతిలో లభించే అతి సహజసిద్ధమైన వెదురుతో తయారు చేసిన వాటర్ బాటిళ్లు ఉపయోగించేవారు. వెదురు వాటర్ బాటిల్స్.. పర్యావరణహితం మాత్రమే కాదు..

ఆరోగ్యానికి కూడా మంచిదని మన అమ్మమ్మలు, నాన్నమ్మలను అడిగితే చెబుతారు. ఆ కాలంలో స్వయంగా చెక్కతో, వెదురుతో చక్కగా, అందంగా వాటర్ బాటిల్స్ తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడంతా పొల్యూషన్ మాయం. ఇలాంటి వాటర్ బాటిల్స్‌ను ఊర్లల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా అరుదుగా కనిపిస్తాయి.