29-06-2025 12:00:00 AM
చాలామంది బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకోవడం కోసం ప్రయాణిస్తారు. ఆ ప్రయాణం ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే మాత్రం కొన్ని ప్రదేశాలను మిస్ అవ్వకుండా చూడాల్సిందే అంటున్నారు పర్యాటక ప్రియులు. మనసుకు ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే.. మనదేశంలోనే పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రసిద్ధ ప్రదేశాలు ఏవో చూద్దాం..
రిషికేష్: రిషికేష్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. దేశంలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది గంగా నది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశంలో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక్కడ అనేక యోగా కేంద్రాలు ఉన్నాయి. దీనితో పాటు ఇక్కడ అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయి. దీన్ని యోగా రాజధాని అని కూడా పిలుస్తారు.
ఆరోవిల్లే
ఇది పుదుచ్చేరిలో ఉంది. దీన్ని ప్రయోగాత్మక టౌన్షిప్ అంటారు. ఇది 1968లో తయారు చేశారు. ప్రశాంతత, విశ్రాంతిని పొందడానికి ఈ ప్రదేశం చక్కటి ప్రదేశం. అందుకే ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. స్పా, మసాజ్ కేంద్రాలు అనేకం ఉంటాయి. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.
గోకర్ణ
కర్నాటకలో ఒక చిన్న పట్టణం గోకర్ణ. ఇది అందమైన బీచ్, హిప్పీ సంస్కృతి, అందమైన దృశ్యాలు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, శుభ్రంగా ఉంటుంది. ఒత్తిడి, రద్దీకి దూరంగా నిశ్శబ్ద ప్రదేశంలో గడపాలనుకుంటే గోకర్ణ చక్కటి డెస్టినేషన్.
అల్లెప్పీ
ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. అల్లెప్పీ బ్యాక్వాటర్ వెకేషన్కు స్పాట్లకు ప్రసిద్ధి. ముఖ్యంగా అల్లెప్పీలో హౌస్బోట్లో ప్రయాణించి ఆనందించవచ్చు. ప్రకృతి పచ్చదనం, జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. అల్లెప్పీలోని ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తారు. ఇది ఆయుర్వేద మసాజ్, స్పాలకు కెరాఫ్ అడ్రస్.