calender_icon.png 17 June, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

12-06-2025 12:03:08 AM

జిల్లా వైద్యాధికారి సీతారాం

కుమ్రం భీం ఆసిఫాబాద్ , జూన్ 11 (విజయక్రాంతి): జిల్లాలోని ఆశ్రమ పాఠశాల లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సీతారాం, డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో జిల్లాలోని ఏఎన్‌ఎం లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంతో పాటు వసతి గృహాల్లో పరిశుభ్రత విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత పై శ్రద్ధ తీసుకోవాలన్నారు. సేజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రభు త్వం నుంచి వచ్చిన స్కేత స్కోపులను ఏఎన్‌ఎం లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జిసిడిఓ శకుంతల ఏటీడీవోలు, ఖమర్ హుస్సేన్, చిరంజీవి, శ్రీనివా స్ ,హెచ్ ఎం మహమ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.