12-06-2025 12:02:11 AM
అశ్వాపురం, జూన్ 11(విజయ క్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోగల మల్లెల మడుగులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ మాట అంగ న్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లెల మడు గు 1 కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల పిల్లలను గుర్తించి వా రి ఇళ్లకు వెళ్లి అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల తల్లిదండ్రులు బాధ్యతగా తమ చిన్నారులను పంపించాలని కోరారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాల్లో చదువుకున్న వారికి సర్టిఫికె ట్లు మంజూరు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజ ర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఆర్ అరుణ, నాగమణి, సాహితి, రావమ్మ, దీప్తి మరియు చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.