17-09-2025 03:42:34 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని నంది కమాన్ చౌరస్తాలో మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17, 1948 అని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్ లింగంపల్లి శంకర్ చింతపల్లి వెంకటేశ్వరరావు చింతపల్లి మోహన్ రావు జింక అనిల్ ఏ రెడ్డి రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగోజు శంకర్ ఉపాధ్యక్షులు ఎరుగోక్కుల రమేష్ బి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిప్పారవేని రాజు మోర్చా అధ్యక్షులు గంట మహేష్ సంతోష్ యాదవ్ గోనె భాస్కర్ సీనియర్ నాయకులు రేగుల పరుశురాం గుండెకర్ల లక్ష్మణ్ చల్ల నరసయ్య అంజన్న యాదవ్ పోచంపల్లి భాను కార్యదర్శులు కొలనూరి సంజీవరెడ్డి రెడ్డవేని శ్రీనివాస్ బూర శేఖర్ అధికార ప్రతినిధి కర్రె పవన్ నాయకులు బూత్ అధ్యక్షులు తమ్మిశెట్టి బాలకృష్ణ రెడ్డవేని రాజు బొల్లు తిరుపతి ఎడ్ల హరీష్ జక్కుల మధు. ముడికే రాములు పాల్గొన్నారు.