11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

వలిగొండ పట్టణంలో ఎంపీడీవో సుడిగాలి పర్యటన

17-09-2025 03:46 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy) సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులను నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం వలిగొండ పట్టణ కేంద్రంలో అనుమతి లేకుండా వెంచర్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వెంచర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను అనుమతి లేకుండా ఫ్లాట్లు చేయవద్దని ఆదేశించారు. అనంతరం మల్లేపల్లిలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, ఏఈ కిరణ్ పాల్గొన్నారు.