07-12-2025 12:27:47 AM
మెగాస్టార్ చిరంజీవి మాస్ -అండ్ -ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’తో అలరించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్స్క్రీన్స్, గోల్డ్బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేశ్ పాత్రకు సంబంధించి షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మరోవైపు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.
ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో శనివారం విడుదలైంది. ‘శశిరేఖా.. ఓ మాట చెప్పా లి.. చెప్పాక ఫీలు కాక..’ అని కథానాయకుడు అంటుండే, ‘ఓ ప్రసాదూ.. మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ..’ అంటూ కథానాయకి బదులివ్వడం ఆకట్టుకుంది.
తమ మనసులోని మాటను ఒకరికొకరు వ్యక్తపర్చుకునే సందర్భంలో వచ్చే పాట అని తెలుస్తోంది. ఈ పూర్తి గీతం ఇదే నెల 8న రిలీజ్ కానుంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ను పర్యవేక్షిస్తున్నారు.